
గరుడ న్యూస్ రామసముద్రం మండల కేంద్రంలోని బలిజ వీధి, బజారు వీధుల్లో శుక్రవారం ఈవోపీఆర్డీ గపూర్ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంపిడివో గపూర్ పారిశుద్ద్యపు పనులు ముమ్మరంగా చేపట్టారు. పారిశుధ్య కార్మికులచే మురుగు కాలువలను శుభ్రం చేయించారు. ప్రతిరోజు గ్రామంలో మురుగునీటి కాలువలు శుభ్రం చేయాలని కార్మికులకు సూచించారు. అలాగే దిగువ హరిజనవాడలో తాగునీటి సమస్యపై వచ్చిన ఫిర్యాదు మేరకు పరిశీలించి తాగునీటి సమస్య పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మునస్వామి నాయక్, పంచాయతీ బిల్ కలెక్టర్, పారిశుద్ధపు కార్మికులు పాల్గొన్నారు.
