
గరుడ న్యూస్ రామసముద్రం మండల నూతన ఎస్సైగా డి.రమేశ్ బాబు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న రవికుమార్ రాయచోటి విఆర్ కు బదిలీ అయ్యారు. రాయచోటి స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న రమేష్ బాబు బదిలీపై వచ్చారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తానని, మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానని రమేశ్ బాబు పేర్కొన్నారు.
