గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలం లోని జాండ్రపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ మాజీ హెచ్ఎం కృష్ణారెడ్డి అనారోగ్య కారణంగా గురువారం మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు తంబళ్లపల్లి శాసనసభ్యుడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి శుక్రవారం పార్థవ దేహానకీ ఘన నివాళులు అర్పించారు ఆయనతోపాటుఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ జెడ్పి వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప, సోమశేఖర్ రెడ్డి, ఇమ్రాన్, రాజారెడ్డి, సీతాపతి, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు