
గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి- సోమల దారిలో కారు బైకు ఎదురు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో సోమల వైపు నుంచి చౌడేపల్లి కు వస్తున్న కారు ఆమినుగుంట మలుపు వద్ద మేకలచిన్న పల్లికి చెందిన అగిస్తప్ప ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాధితున్ని కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
