

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని విలేకరులు పాల్గొని శ్రీ మార్కండేశ్వర దేవస్థానంలో నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.ఈ ప్రెస్ క్లబ్ కు గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ రేవనపల్లి బుగ్గ రాములు,నూతన అధ్యక్షులుగా సింగం కృష్ణ,ఉపాధ్యక్షులుగా – గజం శ్రవణ్ కుమార్,చిలువేరు జంగయ్య,చిలుకూరి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా–బోయ అనిల్ కుమార్,కోశాధికారిగా:సోమన బోయిన కృష్ణ కుమార్ యాదవ్,కార్యదర్శులు:రాచకొండ లింగస్వామి,ఉష్కగుల గిరి గౌడ్,సభ్యులుగా చిలువేరు సైదులు దువ్వ నవీన్,చిలుకరాజు లింగస్వామి,చిలువేరు మురళి,ల ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా అధ్యక్షులు సింగం కృష్ణ పత్రికా ముఖంగా మాట్లాడుతూ జర్నలిస్టులు గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం పేద ప్రజల వెంట ఉంటూ సమస్యలను పరిష్కరించే దిశలో ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్న జర్నలిస్టులను ఆదరించాలని కోరారు.ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ పాటు పడతారని ఈ సందర్భంగా తెలియజేశారు.

