ఆధునిక అంబేద్కర్ సాంఘిక నాటకం పుస్తకావిష్కరణ

G Venkatesh
2 Min Read

గరుడ న్యూస్ చిత్తూరు జిల్లా,పుంగనూరు అడివి నాధుని కుంట గ్రామంలో సాంఘిక గృహప్రవేశం నందు గ్రౌండ్ ఫ్లోర్లో పల్లెలు, కుల నిర్మూలన ,పిల్లలు, చదువులు గ్రామస్తులు సమావేశం ఏర్పాటుకు ఎస్కే యూనివర్సిటీ ప్రొఫెసర్ కంజుల వెంకట్ కుమార్తెలు అమెరిక స్వాజన ఆస్ట్రేలియా సుమన సింగపూర్ స్పందన ఆస్ట్రేలియా సహజన వీర ఆధ్వర్యంలో గ్రౌండ్ ఫ్లోర్ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఆధునిక అంబేద్కర్ ఆధునిక సాంఘిక నాటకం పుస్తకమును అడివి నాథనికుంట నివాసి ప్రిన్సిపాల్ రిటైర్డ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, మాజీ చిత్తూరు మాజీ ఎంపీ ఎం రెడ్డప్ప పుస్తకమును ఆవిష్కరించారు. స్థానిక మాజీ ఎంపీపీ వెంకట్ రెడ్డి యాదవ్, ప్రొఫెసర్ వెంకట్ రెడ్డి అంబేద్కర్,గాంధీ చిత్రపటాలకు పూలమాలవేసి నూతన గృహం ప్రారంభించారు.రిటైర్డ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రాణ స్నేహితులు ఐన వెంకటరెడ్డి కీర్తిశేషులు మునివెంకటప్ప రిటైర్డ్ ఐఏఎస్ కీర్తిశేషులు జయరాం రెడ్డి, మాజీ కాఫీ బోర్డు చైర్మన్ ,పి టి ఆర్ ఆర్ సంస్థ వ్యవస్థాపకుడు గుండాల రామకృష్ణయ్య, నెల్లమంద,రాటైర్ఢ్ విద్యాశాఖ వెంకటప్ప, వీరి చిన్నతనములు చదువుకొనుటకు వారి కష్టాలను కొనియాడారు. అందుకు ప్రొఫెసర్ వెంకట్ రెడ్డి గుర్తుగా మోడల్ స్కూల్ ప్రభుత్వం నుండి హాస్పిటల్ గ్రామ సచివాలయాలు మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట్ రెడ్డి యాదవ్ ,టి ముని వెంకటప్ప రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సహకారంతో అడవి నాదకుంట ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. చాలా సార్లు సహాపంక్తి భోజనాలు, కులాంతర వివాహాలు పరివర్తన సంస్థ ద్వారా ఎన్నో సేవలు చేశారు. అందరూ పల్లె నుండి సిటీలకు విదేశాలకు పోతే ఇతను టౌన్ నుండి గ్రామస్థాయికి వచ్చి గ్రామానికి సేవ చేయటం అతని సేవలను కొనినాడారు. ఈ కార్యక్రమం కు ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బ్యాంకు రెడ్డప్ప, బహుజన సేవాసమితి అధ్యక్షులు కృష్ణమూర్తి, డాక్టర్ గేయానంద, రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ వెంకట రెడ్డి యాదవ్, జయరాం రెడ్డి, డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి, ప్రొఫెసర్ అమరనాథ్ రెడ్డి,లద్దిగంసుదర్శన్,ఆర్టీసీ శ్రీనివాసులు,మాజీ సర్పంచ్ బాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *