
సింగం కృష్ణ, మునుగోడు ప్రతినిధి: భువనగిరి జిల్లా స్టాపర్, సంస్థాన్ నారాయణపురం, జూన్14,(గరుడ న్యూస్): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసరి లవలేష్ తీవ్రంగా ఖండించారు.నోటీసుల పేరుతో కాలయాపన చేస్తూ 6 ఆరు గ్యారంటీల అమలను పక్కన పెడదామనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గతంలో ఏసీబీ అధికారులు కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారించి తేల్చలేకపోయారని ఆయన గుర్తు చేశారు. ఫార్ములా-ఈ రేస్ లో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక హామీలను అమలుచేయక మోసం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్
రెడ్డి మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్,భారతదేశ ప్రతిష్టను దిగజార్చిందని మండిపడ్డారు.హైదరాబాద్లో ఫార్ములా-ఈ రేస్
నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఖ్యాతి లభించడంతో పాటు రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులకు మార్గం సుగుమం చేసిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.

