

మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నం చేస్తాం. మామిడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : చంద్రగిరి ఎమ్మెల్యే పులి నాని.
ఫ్యాక్టరీ యజమానులు మామిడి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో సహకారం అందించండి ; ఎమ్మెల్యే వెల్లడి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4 లక్షల కుటుంబాలు మామిడి పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి…. రైతులందరికీ చంద్రబాబు నాయుడు అండగా ఉంటారు.
రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని తెలపడానికి ఇదొక నిదర్శనం.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల మూడు ఫ్యాక్టరీల వల్ల రైతులు నష్టపోతున్నారు …. ఫ్యాక్టరీలపై మంత్రివర్యులు తగిన చర్యలు తీసుకోవాలి : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.
మామిడి రైతులను బెదిరించే పరిస్థితికి ఫ్యాక్టరీ వారు బరితెగిస్తున్నారు… వారిపై దృష్టి సారించాలి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దామలచెరువు మ్యాంగో నగర్ అతిపెద్దది.
రైతులు, వ్యాపారస్తుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొన్న మంత్రిగారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ముందు చూపుతో మామిడి రైతుల సమస్యలను పడుతున్న ఇబ్బందులను మా దృష్టికి తీసుకువచ్చారు: మంత్రి.
నాని గారు రైతుల సమస్యలను మా దృష్టికి తేవడంతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ చూపి మామిడి రైతులకు కిలోకి నాలుగు రూపాయలు అదనంగా డబ్బులు చెల్లిస్తున్నారు: మంత్రి.
గత వైసిపి పాలకుల పాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలయ్యింది.
ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నప్పటికీ రైతులను మరువలేదు.
గత వైసిపి పాలనలో ఏ నాయకుడైన మామిడి రైతులను వారి సమస్యలను పట్టించుకున్నారా: మంత్రి.
ఈ జిల్లాలో 44 పరిశ్రమలు ఉన్నాయి….. ఇప్పటివరకు 22 మెట్రిక్ టన్నులు ఈ ఫ్యాక్టరీలు కొనుగోలు చేశాయి.
ప్రాసెసింగ్ యూనిట్లు కానీ మండీలు కానీ రైతులను ఇబ్బంది పెడితే తగిన చర్యలు తీసుకుంటాం.
ఫ్యాక్టరీలు సిండికేట్ అయి రైతులను మోసం చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.
కొన్ని ఫ్యాక్టరీలపై నిగా ఉంచాం…. రైతులను ఇబ్బంది పెడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది… వాటిపై త్వరలో చర్యలు తీసుకుంటాం.
ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులతో కూడా మాట్లాడి మామిడి రైతులకు మంచి ధర వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం.
ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు ఆసక్తి పెంచుకోవాలి…. మంచి ఆహారంతో పాటుగా మంచి ధర కూడా ఉంటుంది.
రైతులు నష్టపోకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది…. పొగాకు రైతులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టింది.
మామిడి రైతులు క్వాలిటీ మెయింటింగ్ చేసి నాణ్యత పెంచి మార్కెట్లో ఉంచితే మంచి ధర వస్తుంది …. రైతులు ఆ దిశగా ఆలోచించాలి.
చివరి మామిడికాయ ఉన్నంతవరకు ప్రభుత్వం తరఫున గిట్టుబాటు ధర కనిపిస్తాం : మంత్రి గారు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పంట దిగుబడి అధికం అవడంతో రేటు తగ్గింది: మామిడి రైతులు.
గత 48 సంవత్సరాలలో ప్రభుత్వం తరఫున కేజీ కి 4రూ” సహాయం అందించడం ఇదే మొదటిసారి: మండి వ్యాపారస్తులు .
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన రైతులు , వ్యాపారస్తులు.
గత వైసిపి పాలనలో బయట ప్రాంతాలలో అమ్ముకోవడానికి అనుమతి ఉండేది కాదు…. మామిడి రైతు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు ఎక్కడ గిట్టుబాటు ధర ఉంటే అక్కడ అమ్ముకునే అవకాశం కల్పించారు… అందుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన రైతులు, వ్యాపారస్తులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తోతాపురి అత్యధికంగా నాలుగున్నర లక్ష నుంచి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది: తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్
