సొంత నిధులతో పాఠశాలను అభివృద్ధి పరుస్తున్న హెడ్మాస్టర్ – గ్రామస్తుల ప్రశంసలు

Sesha Ratnam
1 Min Read

కడప జిల్లా, బ్రహ్మంగారి మఠం మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఏ. ఓబుల్ రెడ్డి: నీకు పని చేస్తే నాకేమిస్తావ్ అన్న ఈ కాలంలో…తన సొంత నిధులతో తను పనిచేయుచున్న  పాఠశాలను అభివృద్ధి పరుస్తున్న ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణారెడ్డిని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.పూర్తి వివరాల్లోకెళితే.. మండల కేంద్రమైన బ్రహ్మంగారిమఠంలోని గోవిందమాంబ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లక్ష్మణారెడ్డి  ప్రధానోపాధ్యాయుడుగా ఇక్కడికి వచ్చి కేవలం మూడు రోజులు కావడం గమనార్హం.వాటర్ పైప్ లైన్ సక్రమంగా లేక పోతే పాత పైపుల స్థానంలో కొత్త పైపులు బిగించడం అలాగే విద్యార్థినీ విద్యార్థులు చేతులు కడుగుకొనేందుకై హ్యాండ్ వాష్(భోజనం చేసిన తర్వాత), అలాగే ఆ కడిగిని నీరు ఎక్కడంటే అక్కడ పోకుండా గుంత తవ్వి దానికి సిమెంటు రింగులు వేసి ఆ నీటిని గుంతకు పోయేటట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే స్కూల్ ఆవరణలో మొక్కలు కూడా నాటడం జరిగింది.ఈ మొక్కలను కాపాడి,పెద్ద అయితే స్కూల్ ఆవరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణారెడ్డికి,అదే పాఠశాలలో పనిచేయుచున్న లెక్కల కొండారెడ్డి తోడవడంతో అభివృద్ధి పనులు ముందుకు కొనసాగుతున్నట్లు లక్ష్మణారెడ్డి  తెలియజేశారు.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *