
చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలానికి నూతనంగా వచ్చిన తాహాశిల్దార్ పార్వతి ని మాలమహానాడు నాయకులు కలసి ఆమెను సత్కరించారు.చౌడేపల్లి మండలం లో దళితలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మా దృష్టికి వచ్చిన సమస్యలు ను మీ దృష్టికి తీసుకొస్తాము.ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలని మాలమహానాడు మండల అధ్యక్షులు మణి కోరగా,దానికి తాహాశిల్దార్ సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమం లో పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జ్ కృపామణి, మండల ఉపాధ్యాక్షులు శ్రీరాములు, మండల జనరల్ సెక్రటరీ నక్క సురేష్,గుట్ట రెడ్డిశేఖర్ పాల్గొన్నారు.
