
గరుడ న్యూస్ రామసముద్రం తహశీల్దార్ గా మహమ్మద్ అజారుద్దీన్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ నిర్మలా దేవి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో గా వెళ్లడంతో బి.కొత్తకోట తహశీల్దార్ గా పనిచేస్తున్న మహమ్మద్ అజారుద్దీన్ రామసముద్రం తహశీల్దార్ గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
