
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 16
ఆంధ్ర రాష్ట్రము, చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానమునకు నేడు అనగా 16.06.2025 వ తేదీన శ్రీయుత కమీషనరు, దేవదాయ శాఖ, విజయవాడ వారు గౌరవనీయులు శ్రీ రామచంద్ర మోహన్ గారు విచ్చేసినారు. దేవస్థానము నందు శానిటేషన్, Q లైన్లు, ప్రసాదములు మొదలగు వాటిపై మరియు భక్తులకు శ్రీ అమ్మవారి దర్శనము సులువుగా జరిగినట్లు విలువైన సలహాలు మరియు సూచనలు జారీ చేసియున్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం దేవస్థానము నందు పలు అభివృద్ధి పనులను చేయవలసినదిగా ఆదేశించియున్నారు. ఈ కార్యక్రమములో దేవస్థాన ఉప కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి J. ఏకాంబరం గారు, చౌడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీ గువ్వల రమేష్ రెడ్డి గారు, దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.



