
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,జూన్17,(గరుడ న్యూస్):
తెలంగాణ రాష్ట్ర తుర్క కాశ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నాంపల్లి లో ఎమ్మెల్సీ ఆమెర్ అలీ ఖాన్,కి తెలంగాణ తుర్క కాశ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే బడేసాబ్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం లో తుర్క కాశ కార్మికుల సమస్యలను నెరవేర్చాలని మైనారిటీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు సంబంధం లేకుండా సబ్సిడీ లోన్స్ ఇప్పించాలని,రాయికొట్టేకార్మికులు ఆధునీకరణ పరికరాలు(మిషన్లు),అoదేవిధంగా కృషి చేయాలని ప్రజా పాలన లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాశ, గూడ లను ప్రభుత్వమే దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలి ప్రతి గ్రామానికి ఖబ్రస్తాన్ కు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని
వినతి పత్రంలో కోరడం జరిగింది.అనంతరం ఎమ్మెల్సీ ఆమీర్ అలీ ఖాన్ సానుకూలంగా స్పందించి తుర్క కాశ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,దృష్టికి తీసుకువెళ్లి తగిన పరిష్కారం చూపుతానని భరోసా కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తుర్కకాశ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఎస్.కె అబ్దుల్ రహీం,తదితరులు,పాల్గొన్నారు.
