గువ్వల రమేష్ రెడ్డి చొరవతో పేద కుటుంబానికి నెరవేరిన ఇంటికల

Ashok kumar
1 Min Read

గరుడ ప్రతినిధి

చౌడేపల్లి జూన్ 19

తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి చొరవతో ఇంటి కల నెరవేరింది మండలంలోని చింతమాకుల పల్లి పంచాయతీ బయపల్లికి చెందిన గంగులప్ప కుటుంబం 2 దశాబ్దాలుగా సొంత ఇంటి కోసం కలవరిస్తోంది అదే గ్రామానికి ఓ కార్యక్రమ నిమిత్తం వెళ్లిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డికి గంగులప్ప కుమారుడు ప్రదీప్ కోడలు హేమలు తమకు రెండు దశాబ్దాలుగా ఇల్లు లేదని పూరిగుడిసెలోనే జీవిస్తున్నామని అనడంతో గుండె చెదిరిన గువ్వల రమేష్ రెడ్డి వెంటనే సంబంధిత అధికారితో సంప్రదింపులు జరిపి వారికి పక్కా ఇల్లు మంజూరయ్యేలా చేశాడు తాము అడిగిన వెంటనే చిరకాల స్వప్నమైన పక్కా ఇల్లు మంజూరు చేయించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డికి ఆ నిరుపేద కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది పార్టీలు మారిన పాలకులు మారిన ఇప్పటివరకు ఆ ఇంటికి పక్కా ఇల్లు మంజూరు కాలేదని టిడిపి మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి తర్వాత ఇల్లు మంజూరు చేసినందుకు గ్రామస్తులందరూ నాయకుడంటే ఇలా ఉండాలి అనుకోవడం వినిపించింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *