
పాఠ్యపుస్తకాలు యూనిఫాముల పేర్లతో పేద విద్యార్థుల దగ్గర నుండి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ పాఠశాల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి
బిప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి
మున్నా రాష్ట్ర సమితి సభ్యులు
గరుడ న్యూస్.స్థానిక పుంగనూరు నియోజకవర్గ పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ షూలు టై బెల్ట్ల పేరులతో విద్యార్థుల దగ్గర నుండి లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తూన్నారని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి అంతులేకుండా పోయిందన్నారు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తా ఉన్నప్పటికీ ఎక్కడా కూడా విద్యాశాఖ అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని ఆయన అన్నారు విద్యాశాఖ అధికారులు తీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందన్నారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఈ విధంగా ఫీజులు దోపిడీ జరుగుతున్నప్పటికీ ఎందుకు వారు నోరు మెదడుపడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడా కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల పైన రైట్స్ నిర్వహించి వారి మీద చర్యలు తీసుకున్న దాఖలు లేవు జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ యంత్రాంగం మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల పైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు.ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో వారి దగ్గరే టెక్స్ట్ బుక్కులు యూనిఫామ్ లు టై ఈ బెల్టు వంటివి తీసుకోవాలని పాఠశాల క్యాంపస్ లోనే ఒక స్టోర్ ని మెయింటైన్ చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాయి అన్నారు.సరైనటువంటి వసతులు లేనప్పటికీ విద్యార్థుల దగ్గర నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ సరైనటువంటి విద్యను అందించకుండా విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్స్ పైన వెంటనే చర్యలు తీసుకొని ఈ విధంగా విద్యను వ్యాపారం చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నటువంటి పాఠశాలల పైన వెంటనే చర్యలు తీసుకొని ఆ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. అనంతరం పుంగనూరు మండల విద్యాశాఖ అధికారి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నా పుంగనూరు నియోజకవర్గ నాయకులు గోపీచంద్,హుస్సేన్, గిరిధర్, శేఖర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు


