
గరుడ న్యూస్ పుంగనూరులోని రామ్ నగర్ కాలనీ నందు పుంగనూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు యం జగదీష్ రాజు ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసి 11 సంవత్సరాలు అయిన సందర్భంగా అభివృద్ధికి సంబంధించి కర పత్రాలను ప్రతి ఒక్కరికీ ఇస్తూ పథకాల గురించి వివరించడం జరిగింది.అలాగే కార్యక్రమంలో వికాసిత్ భారత్ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర యువ మోర్చా ఉపాధ్యక్షులు మదాస్ లోకేష్ జిల్లా ఉపాధ్యక్షురాలు మల్లికా రాణి,పెద్దమటం బాబు, చౌడేపల్లి మండల అధ్యక్షులు మనోహర్,నానా బాల కుమార్, వెంకటరెడ్డి, నాగరాజ, మంజు, ఆదినారాయణ, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
