గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 19
స్థానిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఎంఎన్ ఆసుపత్రి చెన్నై వారిచే జరిగిన ఈ శిబిరంలో మొత్తం 35 మంది హాజరుకాగా 12 మంది ఆపరేషన్కు ఎంపికైనట్లు వైద్యాధికారి పవన్ కుమార్ తెలిపారు కంటి పరీక్షలు నిర్వహించి పలువురికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు రహంతుల్లా ఖాన్ ఎంఎన్ ఆసుపత్రి స్థానిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు



