గరుడ న్యూస్.చౌడేపల్లి మండలంలోని 29ఎ చింతమాకులపల్లి గ్రామ పంచాయతీ అధ్యక్షులుగా షావలి ఉపాధ్యక్షులుగా రెడ్డెప్ప రెడ్డి నాయకులు, కార్యకర్తల నడుమ ఏకగ్రీవంగా మండలం అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఎన్నిక కాబడ్డ షావలి మరియు రెడ్డెప్ప రెడ్డి ను దుశ్శాలవతో సత్కరించి అభినందనలు తెలియజేసారు. వీరు ఇరువురు మాట్లాడుతు మా మీద నమ్మకంతో మాకు అప్పగించిన భాద్యతలను శ్రాద్ధశక్తులతో పని చేసి పార్టీకి నాయకులకు మంచిపేరు తెస్తామని తెలియజేసారు. అనంతరం చల్లా రామచంద్రారెడ్డి కి, రమేష్ రెడ్డి కి ప్రత్యేక దన్యవాదాలు తెలియజేసారు. కార్యక్రమములో మండల నాయకులు, 29ఎ చింతమాకులపల్లి పంచాయతీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
