
గరుడ న్యూస్, సాలూరు
20025 2026 విద్యా సంవత్సరం కి సంబంధించి మన్యం పార్వతీపురం జిల్లా కు సంబంధించి సీట్ల భర్తీకై రెండో విడత ప్రవేశాలు కొరకు విద్యార్థులు జూన్ 18 నుండి జూలై 15వ తేది సాయంత్రం 5 గంటల సమయం మించకుండా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ గంటల్లోపు తీసుకోవలెను. అప్లికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ http://iti.ap.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తదుపరి తమ రిజిస్ట్రేషన్ ఐడీ స్లిప్(unique identification number)ప్రింట్ తీసుకొని మీ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నీ దగ్గరలో ఉన్న ఏ ప్రభుత్వ ప్రైవేటు ఐటిఐ లోనైనా వెరిఫికేషన్ చేయించుకొని ఎప్పుడూ చేయించుకోవాలి. లేనియెడల వారి యొక్క డీటెయిల్స్ మెరిట్ లిస్టులో కనబడవు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకున్నవారు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో జూన్ 21న సాలూరు ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో నిర్వహించే కౌన్సిలింగ్ కు హాజరు కావలెను. లేదా ప్రైవేట్ ఐటిఐ లకు దరఖాస్తు చేసుకున్న యెడల ప్రవేశం కొరకు జూన్ 23న నిర్వహించు కౌన్సిలింగ్ కి ఏ ఐ టి ఐ లో దరఖాస్తు చేసుకుంటా ఆ ఐటిఐ కి హాజరు కావాల్సిందిగా సాలూరు ఐటిఐ కాలేజీ ప్రిన్సిపాల్ కన్వీనర్ బి శ్రీనివాసాచారి తెలిపారు. అభ్యర్థులు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి పెట్టు పరిస్థితుల్లో మార్చకూడదు. అభ్యర్థి ఆధార్ కార్డు వివరాలు 10వ తరగతి సర్టిఫికెట్ వివరాలు ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి. ఇతర వివరాల కొరకు 9052508903,8886789002 నంబర్లకు సంప్రదించగలరు.

