
గరుడ న్యూస్ పుంగనూరులో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా SBI రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉదయం 5:30 గంటలకు యోగాపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఇందులో పుంగనూరు ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
