పార్వతీపురంలో మంచినీటి సమస్యను మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
1 Min Read

పార్వతీపురం : పార్వతీపురంలో మంచినీటి సమస్యను రాష్ట్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగులేటి నారాయణ దృష్టికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తీసుకెళ్లారు. యోగాంద్ర కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో పర్యటిస్తున్న మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పార్వతీపురంలో తాగునీటి సమస్యను వివరించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పట్టణంలో కాలువలు రోడ్ల నిర్మాణం సహా పట్టణాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే ప్రతిపాదనలను సావధానంగా విన్న మంత్రి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తో పాటు టిడిపి నాయకులు రాష్ట్ర కొప్పలవెలమ డైరెక్టర్ గొట్టాపు వెంకటనాయుడు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *