
గరుడ న్యూస్, సాలూరు
సాలూరు మున్సిపాలిటీ పరిధి లో చింతల వీధి మోడల్ ప్రైమరీ పాఠశాలకు కొత్తగా బదిలీ పై వచ్చిన ప్రధానోపాధ్యాయుడు డా. రంభ రజినీకాంత్ తన పాఠశాల విద్యార్థుల కోసం తన సొంత ఖర్చుతో ఇరవై వేల రూపాయల విలువైన బోధన అభ్యసన సామాగ్రిని శుక్రవారం పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు డా. రంభ రజినీకాంత్ మాట్లాడుతూ తను చదువుకున్న పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహించడం తన అదృష్టం అని, పాఠశాలలోని ఉపాధ్యాయులందరము బోధన, అభ్యసన సామగ్రిని సద్వినియోగం చేసుకుని ఉత్తమ విద్యను అందించి విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఏ మణికంఠ , కే.శ్రీను ,ఎస్. నాగమణి,ఎల్ రామారావు పాల్గొన్నారు.

