ఘనంగా ఇంటర్నేషనల్ యోగ డే ని నిర్వహించిన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుజాల్ పూర్ శివారులో గల ఈ తక్షశిల స్కూల్ లో యాజమాన్యం విద్యార్థులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ." ఈ సందర్గీబంగా కరెస్పాండెంట్ , అధ్యాపకులు మాట్లాడుతూ గీత ప్రకారం యోగా అంటే కలయిక, ఆత్మ పరమాత్మతో ఐక్యం కావడం. అభ్యాసం ద్వారా బుద్ధికి బలాన్ని చేకూరుస్తూ కోపం, అహం, విషయేచ్ఛలాంటి చెడు గుణాల నుంచి బయటపడి సత్యం, అహింస, కరుణలాంటి దైవీ గుణాలను సంపాదించుకోవడం" , యోగా అనేది ప్రకృతి మనకు నేర్పించిన గొప్ప వరం ప్రకృతిలోని వృక్షం నుండి వృక్షాసనం, ప్రకృతిలోని పక్షుల నుండి బకాసనం, మయూరాసనం, జంతువులలోని సింహాసనం, గోముఖాసనం, మార్జాలాసనం మొదలగునవి ప్రకృతి మనకు నేర్పిన ఆసనాలు, ఆసనాల వల్ల శరీరం గట్టిపడుతుంది, ప్రాణాయామం వలన శ్వాస వ్యవస్థ గట్టిపడుతుంది, ముద్రలు క్రియల వల్ల మొత్తం శరీరాన్ని ఆరోగ్యవంతం చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు యోగాను జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని అని కరస్పాండెంట్ శరత్ కుమార్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం,పిఈటి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.