
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, జూన్ 21, గరుడ న్యూస్ ప్రతినిధి: నాగార్జున
ప్రపంచ 11 అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మై భారత్ ఆధ్వర్యంలో సాలూరు నవజీవన పూర్ చిల్డ్రన్స్ గర్ల్స్ హాస్టల్ లో కార్యక్రమాని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యోగా గురువు అల్లాడ రవీంద్ర మాట్లాడుతూ యోగ నేర్చుకోవడం వల్ల మానసిక ఒత్తిడి,శరీర భంగిమలు, మానసిక ఉత్తేజం కొరకు యోగాని ఉపయోగించడంతోపాటు ఊపిరి వ్యవస్థకు యోగా బాగా పని చేస్తుంది అని అయన అన్నారు. యోగా నేర్చుకోవడం ద్వారా మనసును శరీరంతో ఏకం చేసి ఆత్మతో పరమాత్మను చూడడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆధునిక కాలంలో తినే ఆహారంలో లోపల కారణంగా అతి చిన్న వయసులోనే జబ్బులు పాలు అవుతున్నారు అని అయన అన్నారు. అదేవిధంగా యోగ నిరంతరం చిన్నప్పటినుంచి అలవర్చుకోవడం వలన ఎంతో మేలు అవుతుంది అని అయన అన్నారు.ఈ సందర్భంగా నవజీవన పూర్ చిల్డ్రన్స్ గర్ల్స్ హాస్టల్ మేనేజర్ చిక్కాల చిన్నములు మాట్లాడుతూ చిన్నారులకు యోగా వలన ఎన్నో ఆరోగ్యం ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగ పట్ల చైతన్యవంతులై ప్రతిరోజు చిన్నారులు మానసిక ఒత్తిడి తగ్గి ఉల్లాసంగా ఉంటారని ఆమె తెలియజేశారు. యోగా నేర్చుకోవడం వలన ఏకాగ్రతను పెంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. కావున ప్రతి ఒక్క చిన్నారి కూడా యోగ నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమం అనంతరం చిన్నారులకు సర్టిఫికెట్స్ ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐ.ఆర్.డి.ఎస్ అధ్యక్షురాలు చిక్కాల స్వాతి, పాండ్రం కి సంతోష్ కుమార్, ఎమ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు..
