

చిత్తూరు జిల్లా, కుప్పం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆర్. మంజునాథ్: 21 జూన్ 2025: కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ) ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన “యోగాంధ్ర” కార్యక్రమం భారీ విజయవంతంగా ముగిసింది.
ఈ మహా కార్యక్రమంలో 5,000 మందికి పైగా ప్రజలు పాల్గొని యోగా ప్రాముఖ్యతను పంచుకున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు, ప్రజల్లో యోగా మీద అవగాహన పెంచే దిశగా ఈ కార్యక్రమం ముందడుగు వేసింది.
ఈ సందర్భంగా కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ వికాస్ మర్మత్, ఐఏఎస్ గారు మాట్లాడుతూ:
“యోగం అనేది కేవలం వ్యాయామం కాదు, ఇది శరీరానికి, మనస్సుకు, ఆత్మకు శాంతిని చేకూర్చే మార్గం. కుప్పం ప్రజల ఆరోగ్యం కోసం ఇటువంటి విస్తృత స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణం.”
ప్రజల ఆరోగ్యం, ఫిట్నెస్ మరియు సామాజిక చైతన్యం కోసం కడ ఈ తరహా కార్యక్రమాలను కొనసాగించనున్నది అని తెలిపారు.
– కడ


