
గరుడ న్యూస్,విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ పని చేపట్టినా అది చరిత్ర సృష్టించాల్సిందే…. ఈ విషయాన్ని యోగాంధ్ర మరోసారి నిరూపించింది. ఒకేసారి 3.03 లక్షల మంది విశాఖపట్నంలో యోగాంధ్ర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించింది. దీంతో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ రికార్డును ఏపీలోని విశాఖ అధిగమించినట్టు అయ్యింది.
అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి వచ్చిన 22 వేల 122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి
సూర్య నమస్కారాలు చేసి రికార్డ్ సృష్టించారు.. వారి క్రమశిక్షణ, కృషి, పట్టుదల, అంకితభావానికి అందరూ ముగ్ధులై మెచ్చుకున్నారు… అక్కడే ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు వారిని చూసి మురిసిపోతూ.. ఉత్సాహపరిచి, అభినందిస్తూ, వారి మధ్యకు వెళ్లి ముచ్చటించి, ఫోటోలు దిగారు.. పిల్లల ఆనందానికి అవధులు లేవు.. చాలా సంతోషంగా తిరిగి పాఠశాలలకు బయలుదేరారు.. అద్భుతంగా యోగా చేసిన మా పిల్లలకు నా హృదయపూర్వక అభినందనలు…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ,గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.




