
పుంగనూరు ( గరుడ న్యూస్ )పుంగనూరు పట్టణంలోని మున్సిపాలిటి పరిధిలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వికలాంగులకు ఆదివారం ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ మిధున్రెడ్డి నిధులతో ముగ్గురికి సైకిళ్లు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, నాయకులు నాగభూషణం, ఫకృద్ధిన్షరీఫ్, అమ్ము, రాజేష్, హేమంత్, అమ్ముకుట్టి తదితరులు పాల్గొన్నారు.
