తెగుళ్ల నిర్ధారణ చేసుకుని మాత్రమే మందులు వాడాలి

Panigrahi Santhosh kumar
1 Min Read

గరుడ న్యూస్, సాలూరు

రైతులు పంటలకు ఆశించిన వ్యాధుల నిర్ధారణ చేసుకున్న పిదప మాత్రమే సరియైన మందులను పిచికారీ చేసుకోవాలని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు పాంచాలి గ్రామంలో 32 రకాల 25 కిలోల నవధాన్యాల అనంతరం వరి సాగు ప్రయోగం రైతు కొల్లా సత్యనారాయణ రాజు పొలంలో చేసిన అనంతరం పత్తి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు ప్రస్తుతం పత్తి పంటకు ఎలాంటి తెగుళ్లు లేవని మబ్బు వాతావరణంలో రసం పీల్చు పురుగులు ఆశించే అవకాశం ఉన్నందున రైతులు ముందుగా పొటాష్ ఎరువులు వేసుకోవాలని పంటలను ఆశించే పురుగుల, తెగుళ్ళ ను సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా నిర్ధారించుకొని తదుపరి మాత్రమే తెగుళ్ళ మందుల పిచికారికి వెళ్లాలని సూచించారు. మొక్కజొన్న పంటలో ప్రస్తుతం కత్తెర పురుగు ఆశించిందని దీని నివారణకు నేరుగా ఖరీదైన రసాయన పురుగు మందులను వాడకుండా వేప మందు వేప కషాయం నీమాస్త్రం వంటి మందులతో లేదా క్లోరిపైరిఫాస్ వంటి తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రభావవంతంగా పనిచేసే మందులను మాత్రమే పిచికారి చేసుకోవాలని విచక్షణారహితంగా వాడితే పురుగులు తెగుళ్లు తగ్గకపోవడమే కాకుండా పర్యావరణానికి నష్టం కలిగి జీవ వైవిధ్యం నశించి కొత్త రకాలైన పురుగులు తెగులు ఆశించే ప్రమాదం ఉందని కాబట్టి తప్పనిసరిగా రైతుల సలహాలు సూచనలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఈదుబిల్లి శ్రీను, ఎల్ వన్ తిరుపతి నాయుడు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *