
గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లో శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మకు హుండీ లెక్కింపు ద్వారా రూ 86 84 343 లు ఆదాయంగా సమకూరినట్లు ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు సోమవారం ఆలయంలో లెక్కించిన హుండీ ద్వారా నగదు తో పాటు 61.400 గ్రాముల బంగారం 78.400 గ్రాముల వెండి ఆదాయంగా సమకూరిందన్నారు. అదేవిధంగా రణభేరి గంగమ్మ దేవస్థానం ద్వారా ఆలయంగా వచ్చిందన్నారు. వీటితోపాటు పలు విదేశీ కరెన్సీ భక్తులు కానుకగా వేశారన్నారు .ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ పోలీసు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
