
గరుడ న్యూస్ పుంగనూరులోని మున్సిపల్ బస్టాండ్ సమీపాన ఉన్న శ్రీభోగ నంజుండేశ్వర స్వామి ఆలయం మాస శివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం ప్రత్యేక అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. అర్చకులు లింగానికి రుద్రాభిషేకం, బిల్వార్చనలు, ఫల పంచామృతాలతో అభిషేకాలు చేశారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పరమేశ్వరుని దర్శించుకున్నారు.
