విధులతో సంబంధం లేనివారు వాహనాలపై స్టిక్కర్లు అతికించరాదు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు

Ashok kumar
1 Min Read

గరుడ ప్రతినిధి చౌడేపల్లి జూన్ 24

జిల్లాలో వాహనాలపై  ‘ప్రెస్’, ‘పోలీస్’ స్టిక్కర్ ల పై స్పెషల్ డ్రైవ్..!!

సంబంధంలేని వారు స్టిక్కర్లు వినియోగిస్తే చర్యలు..

అనధికారికంగా సైరన్లు వినియోగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం..

జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్.మణికంఠ చందోలు, ఐ.పి.ఎస్

చిత్తూరు జిల్లాలో కొందరు జర్నలిస్టులు, పోలీసులు కాకున్నా తమ వాహనాలపై ‘ప్రెస్’, ‘పోలీస్’ అని స్టిక్కర్లు అతికించుకుని తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్.మణికంఠ చందోలు, ఐ.పి.ఎస్ హెచ్చరించారు.  ఈ మేరకు జిల్లా ఎస్పీ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

‘ప్రెస్’, ‘పోలీస్’ విధులతో సంబంధం లేనివారు వాహనాలపై స్టిక్కర్లను అతికించుకోవడం చట్ట వ్యతిరేకమని ఎస్పీ తెలిపారు. సంబంధిత గుర్తింపు కార్డులు లేకుండా తిరిగే వారి వాహనాలను స్పెషల్ డ్రైవ్ చేపట్టి తనిఖీ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.నిబంధనలు ఉల్లంఘించే వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే, కొందరు అనధికారికంగా వాహనాలకు సైరన్లు బిగించి ధ్వని కాలుష్యానికి, తోటి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు తెలిసిందని, అలాంటి వాహనాలను తనిఖీలలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *