

పార్వతిపురం, గరుడ న్యూస్ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రాజకీయ స్వార్థంతో ప్రమాదం బారిన పడి గాయపడిన బలిజిపేట మండలం పెదపెంకి పాఠశాల విద్యార్థులను పార్వతీపురం నియోజకవర్గం టిడిపి నేతలు బుధవారం ఉదయం పరామర్శించారు. ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆదేశాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలిసి పండ్లు అందజేసి కొంత నగదు సాయం చేశారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి రాజకీయ అవసరాల కోసం వాడుకున్న వైసిపి నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
