ఈవినింగ్ స్టడీ సెంటర్ ప్రారంభం-విద్యాసామాగ్రి పంపిణీ

Sesha Ratnam
1 Min Read

తిరుపతి జిల్లా, రేణిగుంట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): పాకాల మురళి: పద్మ మహిళా మండలి ఆధ్వర్యంలో
రేణిగుంటలోని ఆర్.సి.యం పాఠశాలలో బుధవారం సాయంత్రం పేద విద్యార్థుల సౌకర్యార్థం ఈవినింగ్ స్టడీ సెంటర్ ను ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న
రేణిగుంట సర్పంచ్ నగేషం చేతుల   మీదుగా నోట్ బుక్స్, ప్యాడు, పెన్సిల్స్ లను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పద్మ మహిళా మండలి ప్రాజెక్ట్ ఆఫీసర్ జూలియన్ రాజు మాట్లాడుతూ ప్రైవేట్ ట్యూషన్ కు వెళ్లలేని పేద విద్యార్థులకు మా వంతు సహాయంగా స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేశామని అన్నారు.ప్రతిరోజు సాయంత్రం స్టడీ సెంటర్లో ఇద్దరు టీచర్లు ఉచితంగా విద్యను బోధిస్తారని తెలిపారు.
పేద విద్యార్థుల చదువు కోసం తమ వంతు సహాయం చేసేందుకు ఎప్పుడు ముందుంటామని అన్నారు. సర్పంచ్ నగేషం మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ఈవినింగ్ స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.విద్యార్థి దశలోనే పిల్లలు క్రమశిక్షణతోకూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సుమశ్రీ లక్ష్మి, శ్రీను,ఉపాధ్యాయులు శౌరి,చిన్నయ్య,తేజ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *