తిరుపతిలో జరిగే  మేధావుల సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్లమెంట్ సభ్యురాలు

Sesha Ratnam
1 Min Read

తిరుపతి జిల్లా, రేణిగుంట రిపోర్టర్ మురళి: తిరుపతిలో జరిగే  మేధావుల సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్లమెంట్ సభ్యురాలు మరియు బిజెపి కేరళ స్టేట్  కో – ఇంచార్జ్ అపరాజిత  సారంగి పాల్గొనన్నారు తిరుపతికి చేరుకున్న ఆమెకు బిజెపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. దేశాన్ని చీకట్లోకి, నెత్తివేసిన “ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు”  పూర్తి అయిన సందర్భంగా తిరుపతిలో  మేధావుల సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు  పార్లమెంట్ సభ్యురాలు మరియు బిజెపి కేరళ స్టేట్  కో – ఇంచార్జ్ అపరాజిత  సారంగి  తిరుపతి చేరుకున్నారు. అంతకుముందు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకి భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ఆత్మీయ స్వాగతం పలికారు, అనంతరం శ్రీకాళహస్తి కలంకారి వస్త్రంతో, సత్కరించి ఘనంగా స్వాగతం పలుకడం జరిగింది. స్వాగతం పలికిన వారిలో, రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్, జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *