డ్రగ్స్ బారిన పడకుండా యువతను కాపాడుకుందాం – ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
1 Min Read

పార్వతీపురం, గరుడ న్యూస్ : ప్రపంచంలో ఎక్కువ మంది యువత గల దేశం, భారతదేశం అని అలాంటి యువత డ్రగ్స్ బారిన పడి చెడిపోతున్నారని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆవేదన వెలిబుచ్చారు. డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర, జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దురదృష్టవశాత్తు వైసిపి పరిపాలనలో రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విపరీతంగా పెరిగిపోయిందని పేర్కొన్నారు. చెట్లు నాటమంటే గంజాయి చెట్లు నాటారని, వ్యాపారాలు చేయమంటే గంజాయితో వ్యాపారం చేసి యువతను చెడు వ్యసనాలకు బానిసలు చేశారని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించి అమలు చేస్తున్నారని వివరించారు ప్రధాన నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ వారికి మంచి ఉపాధి కల్పించి సమాజంలో మంచి పౌరులుగా ఎందుకు చర్యలు చేపట్టారని వెల్లడించారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు నడవడికను గుర్తించి చెడు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలు అయితే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుందని పేర్కొన్నారు డ్రగ్స్ నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీస్ అధికారులు, విద్యార్థులు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *