
గరుడ న్యూస్,సాలూరు
జగన్నాథ రథ చక్రాలు దర్శనం కలిగే శుభ తరుణం ఆసన్నమైంది. ఒడిశా తో పాటు దేశం లో వివిధ ప్రాంతాలలో ,ప్రపంచ వ్యాప్తం గా పలు చోట్ల పూరీ జగన్నాథ స్వామివారి రథయాత్ర కు పండాలు(పూజారి) ఏర్పాట్లు చేస్తున్నారు.సర్వం జగన్నాథ యయం అంటూ ఆ శ్రీ కృష్ణుడి లీలలు స్మరించుకుంటూ భక్తులు ఆనంద డోలికలలో తెలియాడుతున్నారు.సాలూరు శ్రీ జగన్నాథ స్వామి ఆలయం లో ఉదయం 6 గంటల నుండి పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు.జూన్ 27 శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి బలభద్ర,సుభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం ప్రారంభం అవుతుందని,ఆలయ శాశ్వత అనువంశిక ధర్మకర్త,యువరాజు విక్రమ చంద్ర సన్యాసిరాజు తెలిపారు.

