

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా పార్వతీపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. భారత దేశంలో మొట్ట మొదటి సారిగా భారత ప్రభుత్వం వైద్యుల దినోత్సవం 1991 జూలై ఒకటవ తారీఖున ప్రారంభించారు. ప్రముఖ వైద్యులు మరియు పశ్చిమ బెంగాల్ మొదటి ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ ఆయన వైద్య రంగానికి చేసిన కృషి ని గుర్తు చేసుకుంటూ ఆయన గౌరవార్థం ఈ జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకొని ఆయనకు నివాళులు అర్పిస్తారు. యాదృచ్చికం ఏమంటే అతను జూలై 1 వ తారీఖు 1882 న జన్మించారు, అదే జూలై 1వ తారీఖు 1962 న మరణించారు. ఈ సందర్భంగా పార్వతీపురం పట్టణంలో వైద్య సేవలు అందిస్తున్న పలువురు ప్రముఖ వైద్యులకు ఘనంగా సన్మానం చేసి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందచేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన్యం జిల్లాలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ద్వారా విరివిగా నేత్ర వైద్య సేవలు అందిస్తున్న నేత్ర వైద్య అధికారి డా నగేష్ రెడ్డి కి సన్మానం చేసి జ్ఞాపికను అందచేశారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు వైద్యులు చేస్తున్న సేవలను కొనియాడారు.
