ఇంటింటికి తెలుగుదేశం- సుపరిపాలనకు తొలి అడుగు

Panigrahi Santhosh kumar
1 Min Read

గరుడ న్యూస్,సాలూరు

సాలూరు నియోజకవర్గ కార్యాలయంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ,గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం జరిపారు.
పాచిపెంట గ్రామానికి గూడేపు యుగంధర్ గారిని ప్రెసిడెంట్ గా ప్రకటించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ప్రజల సమస్యలను ఎంత వరకు పరిష్కారించారని అందరిని అడిగి తీసుకున్నారు .
గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒక్కొకటిగా వారి సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారని వారి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు ప్రజా సమస్యలను తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు వెళ్ళాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య విధి విధానాలు గురించి మాట్లాడుతూ గత ప్రభుత్వం తాలుక సమస్యలను
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నాయకులకు తెలియచేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *