
గరుడ న్యూస్,యలమంచిలి
జూలై-04, అనగా శుక్రవారం అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం మునగపాక బొడ్డేడ ప్రసాద్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ పోరాటాలకు నిరంతర స్పూర్తి అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. మహనీయుడి ఆశయాల సాధన కోసం మనమందరం కృషీ చేయాలని అన్నారు.


