

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం గరుడ న్యూస్ ప్రతినిధి: G. వెంకటేష్: గరాజీతోనే సత్వర కేసులు పరిష్కారం – న్యాయమూర్తి ఆరీఫాషేక్ వెల్లడిరుడ న్యూస్ పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ నందు ఇరువర్గాలు రాజీతోనే ఏన్ని కేసులైన లోక్ అదాలత్లో పరిష్కరిస్తాం. ఇందుకు ఉదాహరణ శనివారం జరిగిన లోక్అదాలత్లో 61 కేసులు పరిష్కరించి, ఇందుకు గాను రూ.30.44 లక్షల పరిహారాన్ని అందించామని సీనియర్ సివిల్జడ్జి ఆరీఫాషేక్ తెలిపారు. శనివారం న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు ఆకుల చెన్నకేశవులతో కలసి కోర్టు ఆవరణంలో జాతీయ లోక్అదాలత్ను నిర్వహించారు. ఇందులో సివిల్ 19, క్రిమినల్ 42 కేసులు పరిష్కరించారు . అలాగే లోక్అదాలత్లో కేసులు పరిష్కరించి, అవార్డులు పంపిణీ చేశారు. న్యాయమూర్తి ఆరీఫాషేక్ మాట్లాడుతూ జాతీయ లీగల్ సర్వీసస్ అథారిటి మేరకు కేసులను లోక్అదాలత్లో పరిష్కరించడం జరుగుతోందన్నారు. లోక్ అదాలత్లో పరిష్కరించే కేసులపై అప్పీల్ ఉండదన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మైత్రి సంబంధాలను కొనసాగించేందుకు లోక్అదాలత్ను ప్రతి ఒక్కరు వేదిక చేసుకోవాలన్నారు. గ్రామ పెద్దలు, అధికారులు, న్యాయవాదులు తమ పరిధిలోని కేసుల్లోని వాది,ప్రతివాదులను పిలిపించి పరిష్కరించేందుకు సహకరించాలన్నారు. అందరి సహకారంతో పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు వీలుందన్నారు. లోక్అదాలత్కు సహకరించిన న్యాయవాదులకు, అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శివశంకర్ నాయుడు, అంజి బాబు,విజయకుమార్, బాలాజికుమార్ , వెంకటముని యాదవ్, ఆనందకుమార్, వెంకట్రామయ్యశెట్టి, వినోద్కుమార్, వై.భాస్కర్రెడ్డి , ప్రశాంతి, నూరి తదితరులు పాల్గొన్నారు.
