తోటపల్లి నీటిని విడుదల చేసిన సంధ్యా రాణి

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
2 Min Read

పార్వతీపురం, గరుడ న్యూస్ : రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి ఆదివారం తోటపల్లి జలాశయం నుండి ఖరీఫ్ కు నీటిని విడుదల చేశారు. పార్వతీపురం మన్యం, విజయనగరం,  శ్రీకాకుళం జిల్లాల్లోని దాదాపు 17 మండలాల్లోని చిన్న నీటిపారుదల ట్యాంకులను నింపడానికి నీటిని విడుదల చేసారు. ఇది ప్రాజెక్ట్ కింద చివర ఆయకట్టు వరకు నీటి నిర్వహణకు సహాయపడుతుంది. ఈ రిజర్వాయర్ ను 1,31,221 ఎకరాల ఆయకట్టును అందించడానికి యోచించగా, ఇప్పటి వరకు 84,033 ఎకరాల ఆయకట్టుకు అందించగలిగారు.  2024-25 సంవత్సరంలో, రాష్ట్ర ప్రభుత్వం ఎస్ డి ఎం ఎఫ్ (SDMF) గ్రాంట్ కింద కుడి ప్రధాన కాలువలో తుప్పలు తొలగింపు, పూడికలు తొలగింపుకు రూ. 470.72 లక్షలతో అధిక  ప్రాధాన్యత   నీటిపారుదల పునరుద్ధరణ పనులను మంజూరు చేసింది. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. 2025లో, నిర్వహణకు రూ. 67.60 లక్షలతో 10 పనులు మంజూరు అయ్యాయి.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తోటపల్లి రైతుల త్యాగం కారణంగా, ఈ ప్రాజెక్టు మూడు జిల్లాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. లస్కర్ల నియామకానికి ప్రతిపాదనలు సమర్పించాలని, దీని కోసం శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయుటకు చర్యలు  తీసుకోనున్నట్లు తెలిపారు. జంఝవతి, కోటియా సమస్యలపై ముఖ్యమంత్రి ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పారు. పూర్ణపాడు – లాబేసు వంతెన త్వరలోనే పూర్తవుతుందని ఆమె తెలిపారు. ఉపాధి హామీ పథకం పనులకు అడ్డంకులు సృష్టించవద్దని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ఆమె విజ్ఞప్తి చేశారు. రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

పార్వతీపురం సబ్ కలెక్టర్ మరియు ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ప్రాజెక్టుకు భూమి సమస్య పరిష్కారమైందని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద కొన్ని పనులు మంజూరు చేశామని ఆయన అన్నారు. ఏదైనా పని పెండింగ్‌లో ఉంటే, వాటిని పరిష్కరిస్తామని ఆయన అన్నారు. ఈ రిజర్వాయర్ పర్యాటక అభివృద్ధికి చాలా అనుకూలంగా ఉందని, దాని గురించి ఆలోచిస్తున్నామని ఆయన తెలియజేశారు.

- Advertisement -
Ad image

ఈ కార్యక్రమంలో  ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, జల వనరుల సూపరింటెండింగ్ ఇంజనీర్ కెవిఎన్ స్వర్ణ కుమార్, తోటపల్లి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెచ్ మన్మధరావు, డిప్యూటీ ఇఇ బి గోవిందరావు, రఘు,తోటపల్లి నీటి సరఫరా కమిటీ అధ్యక్షులు పల్లా పాపి నాయుడు, ట్రైకార్ బోర్డు సభ్యులు పువ్వుల లావణ్య, ఇతర అధికారులు, అనధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *