
గరుడ న్యూస్ తిరుచానూరు: (గరుడ న్యూస్) ప్రతినిధి హరికృష్ణ: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గురువారం సాయంత్రం బీహార్ కి చెందిన ప్రీతం స్వామీజీతో కలిసి తిరుపతి పట్టణ అభివృద్ధి చైర్మన్ టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఏఈవో దేవరాజులు సూపర్డెంట్ రమేష్ ఆలయం వద్ద స్వాగతం పలికి వీరికి అమ్మవారు దర్శనము కల్పించి వీరికి వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు అనంతరం ఆలయ అధికారులు వీళ్ళకి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రీతం స్వామీజీతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దేవరాజులు సూపర్డెంట్ రమేష్ అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు.📧️ your_email@gmail.com




