
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాప్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి ఆగస్టు5,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు,చిమిర్యాల మాజీ సర్పంచ్ దోనూరు జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో ఆయనకు శాల్వా కప్పి,కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ,జిల్లా కార్యదర్శి ఏపూరి సతీష్,మండల అధ్యక్షులు శ్రీను నాయక్ నాయక్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అక్బర్ అలీ,వీరమల్ల వెంకటేష్ గౌడ్,నోముల మాధవరెడ్డి,ఈసం స్వామి,శేఖర్ రెడ్డి,రెడ్యా నాయక్,మెరుగు గిరి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,తదితరులు,పాల్గొన్నారు.



