
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అగష్టు21,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నూతన ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు.ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ముత్యాలమ్మ తల్లి దీవెనలు పొందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు,అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్యానాయక్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కట్ట గాలిబ్,గుత్త శేఖర్ రెడ్డి,బల్లెం రామస్వామి,మారగోని శంకర్ గౌడ్,గుండమల్ల బాలకృష్ణ, ధరణి శీను,మందుగుల సాయి కిరణ్,తదితరులు,పాల్గొన్నారు.


