
గోవా గవర్నర్ గా ఎంపికైన మాజీ మంత్రి, విజయనగరం రాజు పూసపాటి అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టి మొదటిసారి మన రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా విశాఖపట్నం ఎయిర్పోర్టులో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముందుగా పుష్పగుచ్చం అందజేసి దుస్సాల్వతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజుతో పార్వతిపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర చర్చించారు.



