గరుడ న్యూస్ పుంగనూరు ప్రతినిధి : 03/09/2025

పుంగనూరు పట్టణంలోని బైపాస్రోడ్డులో గల శ్రీహరహరపురం మఠాదిపతి శ్రీ స్వయంప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి ఈనెల 12న రానున్నారు. ఈ మేరకు బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు మురళిధర్, ఆర్కె.రామకృష్ణ, రాజేష్, మహేష్, రవి, డాక్టర్ రమణరావు తదితరులతో బుధవారం మఠంనిర్వాహకులు సమావేశమైయ్యారు. స్వామివారు 11న రాత్రి పుంగనూరు చేరుకుని, 12న శ్రీచక్రనవరణపూజ, శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో పట్టణ ప్రజలు పాల్గొని స్వామివారి కృపకుపాత్రులు కావలెనని బ్రాహ్మణ సంఘనేతలు కోరారు


