గరుడ ప్రతినిధి
చౌడేపల్లి సెప్టెంబర్ 13
మండలం లో సత్య ప్రమాణాలకు పేరుగాంచిన రాజనాల బండపై శనివారం సత్య ప్రమాణాలు జోరుగా కొనసాగించారు ఉదయాన్నే టీటీడీ టెంపుల్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రధాని అర్చకుడు కృష్ణమూర్తి చే ప్రసన్నా ఆంజనేయ స్వామి మరియు లక్ష్మీ నరసింహ స్వామికి విశేష పూజలు నిర్వహించారు తరువాత చిత్తూరు మరియు బంగారుపాలెం బి.కొత్తకోట నిమ్మలపల్లి మండలం బండ్లపై మొదలగు గ్రామాల నుంచి ప్రమాణాలకు హాజరు అయినారు కొందరు ప్రమాణాలు చేయగా మరికొందరు వాయిదా వేసుకుని వెళ్లారు గత వారంలో ప్రమాణలు వచ్చిన వారికి ప్రమాణాలు చేయక మునుపే 50000 రూపాయలు రికవరీ అయినట్లు టెంపుల్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ తెలియజేశారు ఈ క్రమంలో భక్తులు ఆలయాన్ని దర్శించి ఆంజనేయ స్వామికి పూజలు అందించారు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు



