ప్రజలలో పార్టీని భాగస్వామ్యం చేస్తాం – మాజీ ఎంపి రెడ్డెప్ప

G Venkatesh
1 Min Read

పుంగనూరు : 16/09/2025

Article Image 1
Article Image 2

( గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జ్ ) ప్రజలలో వైఎస్సార్‌సిపిని భాగస్వామ్యం చేసి పార్టీని పటిష్టపరచడమే లక్ష్యంగా నియోజకవర్గంలోని ప్రతిచోట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపి రెడ్డెప్ప తెలిపారు. మంగళవారం ఆయన మున్సిపాలిటిలోని 10వ వార్డులో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, కన్వీనర్‌ వజ్రభాస్కర్‌రెడ్డి , రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం తో కలిసి వార్డుస్థాయి విస్తత సమావేశాలు నిర్వహించారు. అలాగే మండలంలోని ఏటవాకిలి గ్రామంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, రాష్ట్ర కార్యదర్శి అనీషారెడ్డి, ఎంపిపి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటి నిర్మాణ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు, గ్రామం స్థాయిలో కమిటిలు ఏర్పాటు, విధివిధానాలు , ప్రజల భాగస్వామ్యంతో యువత, మహిళ , రైతు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కల్పించాల్సిన ప్రాతినిధ్యంపై చర్చించారు. రెడ్డెప్ప మాట్లాడుతూ మాజి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ కమిటి సభ్యులచే నేరుగా పెద్దిరెడ్డి మాట్లాడే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని కమిటి సభ్యులకు దిశనిర్దేశం చేస్తారని తెలిపారు. దీని ద్వారా పార్టీ అన్ని విధాల పటిష్టమౌతుందని తెలిపారు. ఈ సమావేశాల్లో పట్టణ, రూరల్‌ అధ్యక్షులు ఇర్ఫాన్‌, అమరనాథరెడ్డి , కౌన్సిలర్లు పూలత్యాగరాజు, అమ్ము, బోయకొండ మాజీ చైర్మన్‌ నాగరాజారెడ్డి , ఆయా ప్రాంత ఎంపిటిసిలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *