సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సెప్టెంబర్26,(గరుడ న్యూస్):

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహించేందుకు సన్నాహాలు ఉపందుకున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రక్రియ పై మునుగోడు క్యాంపు కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రజలకు చేరువైన సన్నబియ్యం పంపిణి,మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం,200 యూనిట్ల ఉచిత కరెంటు,రేషన్ కార్డుల పంపిణి,ఇందిరమ్మ ఇల్లుల మంజూరు లాంటి పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నప్పటికి కొన్ని పూర్తిగా నెరవేర్చకపోవడానికి ఉన్న ఇబ్బందులను ప్రజలకు అర్థమయ్యే విదంగా వివరించాలని అన్నారు.ఓ వైపు ఛిద్రం చేసిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ధుతూనే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని,మరో వైపు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి పనులు చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.గత పాలకులు చేసిన పాపాలకే ఇపుడు ఇబ్బంది పడుతున్నామని,ప్రాజెక్టుల పేరు మీద చేసిన అప్పులకు ఈ ప్రభుత్వం వడ్డీలు కడుతూనే వ్యవస్థను గాడిలో పెడుతున్న తీరును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.ఇందిరమ్మ ఇల్లుల మంజూరులో నెలకొన్న ఇబ్బందులు అధిగమించడానికి నిబంధనల సడలింపు పై ప్రభుత్వం తో మాట్లాడి నిజమైన నిరుపేద అర్హులకు నాయ్యం జరిగేలా ప్రయత్నం చేస్తానని అన్నారు.గ్రామ స్థాయి లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి అనుసరించాల్సిన అంశాల పై కూలంకషంగా చర్చించారు.ఈ సమావేశంలో వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



