పాదాచారులకు బెంచీలను బహుకరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుమహమ్మద్ అక్బర్ అలీ

singhamkrishna
1 Min Read

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అక్టోబర్09,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కొత్తపేట కాలనీ హనుమాన్ గుడి వద్ద బయో డీజిల్ వెళ్లే రోడ్డు మార్గం నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటుంది.ఈ నేపథ్యంలో పాదాచారులు సేద తీరడానికి సిమెంట్ బెంచీలను బహుకరించారు కాంగ్రెస్ పార్టీ మండలం సీనియర్ నాయకులు మహమ్మద్ అక్బర్ అలీ.ఈ సందర్భంగా కాలనీలో బెంచీలను ఏర్పాటు చేసినందుకు కాలనీవాసులు అక్బర్ అలీ,కి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాసమల్ల యాదయ్య,బోయ నరసింహ్మ,కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతటి స్వామి గౌడ్,పత్రికా విలేఖరి సింగం కృష్ణ,కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చెరుకుపల్లి శ్రీకాంత్(సింగర్),చెరుకుపల్లి శివ(యోగి),ఏపూరు శివయ్య,కట్ట శివ,గుజ్జుల బాలయ్య,కిష్టయ్య,కాలనీ వాసులు,తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *